శరబయ్య విగ్రహాలు ఎందుకు లేవు ?

శరబయ్య విగ్రహాలు ఎందుకు లేవు ?

TEJA NEWS

శరబయ్య విగ్రహాలు ఎందుకు లేవు ?

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పై కీర్తనలు రాసిన అన్నమయ్య గొప్ప వాడు అని టీటీడీ తో సహా అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అన్నమయ్య విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.

మరి సాక్ష్యాత్తు వెంకటేశ్వర స్వామి తో కలిసి జీవించి ప్రపంచానికి స్వామి వారిని పరిచయం చేసిన, స్వామి వారి ఆశీస్సులతో ప్రతి దినం తొలి దర్శనం చేసుకుంటున్న గొల్ల సన్నిది శరబయ్య గారి విగ్రహాలు కి ప్రాధాన్యత ఎందుకు లేదు ?

ఇది పాలక వర్గాల కుల గజ్జి , కుల వివక్ష కాదా ?

ఇలాంటి వారిని ప్రశ్నించాను యాదవులు బానిసలు కాదా ?

జై శ్రీ కృష్ణ పరమాత్మ.

జై కార్తికేయ .

జై ఛత్రపతి శివాజీ.

జై వీర పాండ్య కట్టా బొమ్మాన్

జై శ్రీ కృష దేవరాయ.

ఇలా చెబుతూ పోతే చారిత్రక ప్రాధాన్యత వున్న యాదవులు వేల మంది వున్నారు.

ఒక ఊరిలో పాలేగాడి గా బ్రిటిష్ ప్రభుత్వం లో పని చేస్తూ జీతం పెంచలేదని బ్రిటిష్ వారిని అడిగితే తల నరికి గుమ్మానికి వెలాడ తీయబడిన వుయ్యాల వాడ నరసింహ రెడ్డి కి విగ్రహాలు పెట్టి కర్నూల్ జిల్లా రాజు గా చిత్రీకరిస్తూ విగ్రహాలు పెట్టిన రాయల సీమ కాపులు ( రెడ్డి) కి వున్న కులం పై అభిమానం యాదవ సమాజానికి లేకపోవటం వలనే యాదవ ప్రముఖులకు తగిన ప్రాధాన్యత దక్కటం లేదు.

అంతే కాదు యాదవులు ఆర్థికం గా అభివృద్ది చెందక పోవటానికి కారణం కూడా యాదవ సమాజము చేస్తున్న తప్పులు, నిర్లక్ష్యమే కారణం.

Print Friendly, PDF & Email

TEJA NEWS