TEJA NEWS

టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలు విరాళం

    తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన టివిఎస్ మోటార్స్ ఎండి   వేణు సుదర్శన్  టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. 

 ముందుగా అలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ ఈవో    శ్యామలరావు,  అదనపు ఈవో   సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాల తాళాలను అందజేశారు.

  16 ద్విచక్ర వాహనాలలో  15 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల ధర దాదాపు రూ.22 లక్షలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


TEJA NEWS