బ్రహ్మోత్సవాలకి అందరికీ ఆహ్వానం స్థానిక రాముల వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో గోవర్ధనగిరి గౌడ్ సతీసమేతంగా రాములు వారికి శేష వాహనం సమర్పించుకున్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా పున: నిర్మించుకున్న శ్రీ కోదండ రాముల వారి దేవస్థానంలో, బ్రహ్మోత్స వాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతాయి భక్తులందరూ సందర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆ రామయ్య ఆశీస్సులు కోవూరు మండల ప్రజలకు ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ బండ్ల సురేష్,…
Tag: andhrapradesh
అల్లర్లపై నమోదైన ప్రతి కేసును విచారించాలన్న సీఈసీ.. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఆదేశం.. రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలన్న సీఈసీ.
తాడిపత్రికి దూరంగా పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి.. కొనసాగుతున్న 144 సెక్షన్.. హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 91 మంది అరెస్ట్.
ఉండి నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఎంపీ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ రఘురామకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయంపైఇ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 125 నుంచి 150 సీట్లలో కూటమి గెలుస్తుందన్నారు. వైసీపీ మాత్రం 25 నుంచి 40 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పుకొచ్చారు.…
విశాఖపట్నం రేంజ్ డిఐజి విశాల్ గున్ని, ఐపిఎస్ ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు తరువాత జరిగిన సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై విశాఖపట్నం రేంజ్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలు మరియు ఇతర పోలీసు అధికారులతో విశాఖ రేంజ్ డిఐజి విశాల్ గున్ని, ఐపిఎస్ విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో మే 16న సమీక్షా సమావేశం మరియు జూమ్ మీటింగు నిర్వహించారు. ఈ సందర్భంగా…
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలించారు. ఎన్నికల సందర్భంగా తాడి పత్రిలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో జెసి నివాసంలో ఉన్న పని మనుషులను అనుచరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. జేసి దివాకర్ రెడ్డి తాడి పత్రిలో ఉంటే సమస్యలు పునరావృతం అవుతా యంటూ పోలీసులు చెప్పారు. తాడిపత్రి వదిలి వెళ్లాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు అనారో గ్యంతో ఉన్నారని…
ఈసీవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్ కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. 13 వ తేది అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. ఈవీఎంలను సీల్ చేసే ప్రక్రియ జరిగిందన్నారు. పరిశీలకుల నుంచి రీ పోలింగ్కు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. 33…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోదయిందని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ బుధ వారం ప్రెస్ మీట్ నిర్వహించి పోలింగ్ వివరాలను వెల్లడిం చారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్ కొనసాగిందని చెప్పారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటలకు పోలింగ్ ముగిసినట్లు తెలిపారు.…
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, కాలినడకన తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు.
కోవురు నియోజకవర్గ ప్రజలతో అతి తక్కువ కాలంలోనే మమేకం అవ్వడం చాలా ఆనందంగా భావిస్తున్న ఎన్నికల ప్రచారం మరియు విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, స్నేహితులకు, నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు, నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి