ప్రతీ గ్రామం లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు జరపాలి –
కమలాపూర్ :
ఎంఆర్ పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు కమలపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా కో కన్వీనర్ మరియు కమలాపూర్ మండల ఇంచార్జ్ అంకిల్ల రాజు అన్నారు . దళితులు ఉన్నత స్థాయికి ఎదగాలని సమాజంలో అందరికి సమాన హోదా పొందాలనే ఉద్దేశంతో మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ అనే ఒక ఉద్యమ సంస్థని ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. మంద కృష్ణ మాదిగ చేసిన ఉద్యమాల వల్లనే ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా దళితులకు ఒక ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కావున ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కమలాపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేసి దళితుల సోదరులందరూ సంబరాలు చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ శ్రేణులకు అంకిల్ల రాజు పిలుపునిచ్చారు.
ప్రతీ గ్రామం లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు జరపాలి –
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
TEJA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
TEJA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో పారిశుద్ధ…