TEJA NEWS

బిఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడకండి ఎల్లప్పుడూ అండగా ఉంటాం

  • బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి భరోసా

బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడద్దని.. ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయనతోపాటు మరికొంతమంది నాయకులు పార్టీ మారడం పై బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరడం బాధాకరమైన విషయమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.


TEJA NEWS