గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి..
చిలకలూరిపేట పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో షేక్ లాలూ దాదా సాహెబ్ సేవా సమితి ఆధ్వర్యంలో షేక్ సిద్ధాంతి కరిముల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , చిత్రపటాలను స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పుల్లారావు మాట్లాడుతూ గ్రంధాలయం అభివృద్ధికి కృషి చేయనున్నట్టు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అద్యక్షులు తేళ్ల సుబ్బారావు గారు అందించిన 10 వేల రూపాయల విలువగల పోటీ పరీక్షల పుస్తకాలను పుల్లారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి కరిముల్లా, చేవూరి కృష్ణమూర్తి, వార్డు కౌన్సిలర్ కొత్త కుమారి, కొటేశ్వరావు, గ్రంథాలయ అధికారి నాగుల్ మీరా వలి, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి..
Related Posts
ఏడు కొండల వాడితో పెట్టుకోవద్దు… జగన్ కు లోకేష్ వార్నింగ్.
TEJA NEWS ఏడు కొండల వాడితో పెట్టుకోవద్దు… జగన్ కు లోకేష్ వార్నింగ్. ఫేకు వార్తల జగన్ అంటూ వైఎస్ జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై విమర్శించే మంత్రి నారా లోకేష్… ఈసారి జగన్ ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. నువ్వు…
అమరావతి: సీఎం ఆఫీసుకు వివేకా కూతురు
TEJA NEWS అమరావతి: సీఎం ఆఫీసుకు వివేకా కూతురు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలసిన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత సీఎంను సునీత కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే సీఎంను…