TEJA NEWS

రేవంత్కు దమ్ముంటే ముందుగా ఒవైసీ కాలేజీలు కూల్చాలి : బండి సంజయ్‌.

హైడ్రా కూల్చివేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సెటైర్లు వేశారు. హైడ్రా కూల్చివేతలు కక్షసాధింపు చర్యల్లా కనిపిస్తున్నాయని అన్నారు. అన్ని ఆక్రమణల విషయంలో హైడ్రా ఒకేలా వ్యవహరించడం లేదని సంజయ్ మండిపడ్డారు. నాగోల్ శుభమ్ కన్వెన్షన్‌లో బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్ జరిగింది. దీనికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సల్కం చెరువులో ఆక్రమణలను ఎందుకు కూల్చడంలేదని ప్రశ్నించారు.

ఒవైసీ కాలేజీకి మాత్రం ఏడాది సమయం ఎందుకిచ్చారని సంజయ్ నిలదీశారు. అందరికీ ఒకే న్యాయమైతే.. ఒవైసీ కాలేజీని కూల్చాలంటూ సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే ముందుగా ఓవైసీ బ్రదర్స్ ఆక్రమణలు తొలగించాకే ఇతర భవనాల జోలికి వెళ్లాలని సవాల్ చేశారు సంజయ్. అక్రమ కూల్చివేతలకు తాము వ్యతిరేకం కాదన్న సంజయ్.. హైడ్రా పేరుతో పేదలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు.2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వానికి .. రేవంత్ ప్రభుత్వానికి పెద్దగా తేడా లేదని బండి సంజయ్ విమర్శించారు.


TEJA NEWS