TEJA NEWS

పేదింటి విద్యార్థులకు ఏకరూప దుస్తువులు పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు సతీష్

సూర్యాపేట జిల్లా : సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలో వృత్తివిద్య అధ్యాపకులు డాక్టర్ జి.సతీష్ 15 మంది పేదింటి విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఉచితంగా పపంపిణీ చేశారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ పెరుమల్ల యాదయ్య మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి గత సంవత్సరం ఈ సంవత్సరం పేద విద్యార్థులకు ఏకరూప దుస్తులు బహుకరించడం హర్షణీయమని అన్నారు. తాను ఇదే విషయమై సతీష్ మాట్లాడుతూ సంపాదిస్తున్న దాంట్లో కొంత పనిచేస్తున్న వ్యవస్థలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు సహాయం చేయడం నాకు తక్కిన మంచి అవకాశం గా భావిస్తున్నానని తెలిపారు. దుస్తువుల దాతలకు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.


TEJA NEWS