రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

TEJA NEWS

లోక్ సభ స్థానాల్లో మొత్తం 454 మంది బరిలో ఉండగా, అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో వెల్లడించారు.

అత్యధికంగా విశాఖ లోక్ సభ స్థానంలో 33 మంది అభ్యర్థులు నిలవగా.. అత్యల్పంగా రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం నుంచి 12 మంది మిగిలారని తెలిపారు.

శాసనసభా స్థానాల విషయానికి వస్తే.. తిరుపతి అసెంబ్లీ సెగ్మెం ట్లో అత్యధికంగా 46 మంది పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా చోడవరం నుంచి ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతున్నారని వివరించారు.

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 40 మంది అభ్యర్థులు పోటీలో ఉండటం గమనార్హం.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Similar Posts