ఏపీలో ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్ బ్యూరో) కొన్ని ప్రాంతాలకు అలర్ట్ చేసింది. కాకినాడ సిటీ, పిఠాపురంలో అలర్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. కౌటింగ్కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగి అవకాశాలు ఉన్నాయని ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక పంపింది. కాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావు పేటపై ప్రత్యేక దృష్టి సారించింది.
Posted inANDHRAPRADESH