TDP responsibilities should be handed over to Lokesh
టీడీపీ బాధ్యతలు లోకేష్కు అప్పగించాలి..చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజే జరగాలి :బుద్దా వెంకన్న
తెలుగు దేశంలో పార్టీ బాధ్యతలను నారా లోకేష్కు అప్పగించాలని ఆ పార్టీ లీడర్ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. దీని ఎక్కువ టైం తీసుకోవద్దని సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన రోజునే జరిగిపోవాలని అన్నారు.
మూడు వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి పార్టీ పటిష్టానికి శ్రమించిన లోకేష్ కంటే అర్హుడు ఎవరని ప్రశ్నించారు. తాను చెబుతున్నది రిక్వస్ట్ కాదని డిమాండ్ అని అన్నారు.
విజయవాడలో ప్రెస్మీట్ పెట్టిన టీడీపీ లీడర్ బుద్ద వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అన్ని వర్గాల మద్దతు లోకేష్కు ఉందని… చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పార్టీని సమర్థంగా నడిపారన్నారు బుద్ద.
ఈ ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీతో కూటమి అధికారం చేపడుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అందులో సందేహం లేదన్నారు బుద్ద వెంకన్న.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-24-at-12.33.26-1024x576.jpeg)