భారత్- శ్రీలంక మధ్య వారధి నిర్మాణానికి కసరత్తు
పర్యాటకాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భారత్ – శ్రీలంక మధ్య వంతెనను నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకలోని తలైమన్నార్ను కలిపేలా 23 కి.మీ మేర ఈ వారధిని నిర్మించాలని చూస్తున్నారు. దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-23-at-8.18.16-PM-1024x823.jpeg)