22న పాలకొండలో జాబ్ మేళా

TEJA NEWS

Job fair at Palakonda on 22nd

22న పాలకొండలో జాబ్ మేళా

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ :

నిరుద్యోగ యువతీ,యువకుల కు ఉపాధి కల్పించు నిమిత్తం అపోలో టైర్స్ లో 150 ఉద్యోగాలు, మోడెలెజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ లో 80 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని జిల్లా ఉపాది అధికారి ఆర్. వహీదా అన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.జూన్ 22వ తేదిన పాలకొండ డిగ్రీ కళాశాలలో ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు.

అపోలో టైర్స్ సంస్థ లో 150 నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) ఉద్యోగాలకు 18 నుండి 23 సంవత్సరాల వయస్సు కలిగి 2020 -24 బ్యాచ్ కు చెంది, ఏదైనా డిప్లొమా, బి. టెక్, డిగ్రీ లో విద్యార్హత కలిగిన స్త్రీ, పురుష అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఎంపిక కాబడిన అభ్యర్ధులకు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఉద్యోగం కల్పించి, 16 వేల రూపాయలు జీతంతో పాటు ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు. మోడెలెజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ లో 80 టైనీస్ ఉద్యోగాలకు 18 నుండి 21 సంవత్సరాల వయస్సు కలిగి ఇంటర్మీడియట్ లో 50% ఉత్తీర్ణత సాధించిన స్త్రీ, పురుష అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఎంపిక కాబడిన అభ్యర్ధులకు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఉద్యోగం కల్పించి, 15 వేల రూపాయలు జీతంతో పాటు ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు.

అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు https://employment.ap.gov.in/ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవలెనని పేర్కొన్నారు.

అభ్యర్ధులు తమ ఒరిజనల్ సర్టిఫికేట్లు తోపాటు బయోడేటా, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, 2 పాస్ ఫొటోలతో జూన్ 22వ తేదిన ప్రభుత్వ డిగ్రీకళాశాల, పాలకొండలో నిర్వహించే జాబ్ మేళాకు హాజరు కావలసినది గా పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9908827160 మొబైల్ నెంబర్ను సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు

Print Friendly, PDF & Email

TEJA NEWS

Similar Posts