అనకాపల్లిలో బయటపడిన మరో ప్యాలెస్
Another palace excavated at Anakapalli
అనకాపల్లిలో బయటపడిన మరో ప్యాలెస్
అనకాపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కడుతున్న మరో ప్యాలెస్ వెలుగులోకి వచ్చింది.
జీవీఎంసీ అనుమతులు లేకుండా హైవే సమీపంలో 1.75 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు.
ఈ భూమిని ప్రభుత్వం నుంచి వైసీపీ 33 ఏళ్లు లీజుకు తీసుకుంది.
ఏడాదికి ఎకరానికి కేవలం రూ.1000 చెల్లించేలా గతంలో అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
తాజాగా ఈ వ్యవహారం బయటకు రావడంతో టీడీపీ ఘాటు విమర్శలు చేస్తోంది.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-22-at-13.30.56-1024x557.jpeg)