గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

TEJA NEWS

వికారాబాద్ జిల్లా

వికారాబాద్:గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లి బ్రిడ్జి సమీపంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ నుండి పరిగివైపు వెళ్లే ప్రధాన రహదారిపై రాత్రి 8:30 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనంతో మద్గుల్ చిట్టెంపల్లి గ్రామానికి చెందిన దాసు 35 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు దాసు జిల్లాని మహావీర్ హాస్పిటల్లో వంట మనిషిగా పనిచేసేవాడు. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడ్డాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసు విచారణలో తేలనున్నాయి.

Print Friendly, PDF & Email

TEJA NEWS