రేషన్ షాపులపై చర్య తీసుకోవాలి

రేషన్ షాపులపై చర్య తీసుకోవాలి

TEJA NEWS

👉రేషన్ షాపులపై చర్య తీసుకోవాలి.
👉రెవిన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.
👉అక్రమాలకు పాల్పడిన రేషన్ డీలర్ల లైసెన్సులు రద్దు చేయాలి.
👉సిపిఎం పట్టణ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్.

సూర్యాపేట టౌన్: దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం ఇవ్వాల్సి ఉండగా సూర్యాపేట పట్టణంలో రేషన్ డీలర్లు సిండికేట్ గా మారి పేదలకు రేషన్ ఇవ్వకుండా రేషన్ బియ్యంకు బదులు డబ్బులు ఇస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి వల్లపుదాసు సాయికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేటపట్టణంలోని 7 వార్డులో జరిగిన సిపిఎం శాఖ సమావేశంలోఆయన మాట్లాడుతూ పేదలందరికీ రేషన్ షాపు ద్వారా మనిషికి 6 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, పట్టణంలోని రేషన్ డీలర్లు అందరూ కుమ్మక్కై పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ బియ్యానికి బదులు పేదలకు కేజీకి రూ.10 చొప్పున నగతుఇస్తున్నాడనిఆరోపించారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే నీ దిక్కున్న చోట చెప్పుకోమని డీలర్లుబెదిరిస్తున్నారనిఅన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోరేషన్ డీలర్లు నిస్సిగ్గుగా బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్న రెవిన్యూ అధికారులు, జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇవ్వవలసినరేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ అక్రమ సంపాదనకు మరిగిన రేషన్ డీలర్లపై జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ డీలర్ల లైసెన్సును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపులో నిరంతరం తనిఖీలు చేయవలసిన రెవిన్యూ అధికారులు రేషన్ డీలర్లు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి ఇటువైపు చూసిన నాదుడే లేడని విమర్శించారు. తక్షణమే రేషన్ డీలర్లు తమ పద్ధతిని మార్చుకోవాలని లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS