జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఓవరాల్ గా 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా ఫలితాల్లో బాలికలదే పై చేయి. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్ లో ఉంది. 65 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ లాస్ట్ లో ఉంది. ఇక జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.
Posted inTELANGANA