చంద్రబాబు ని కలిసిన బీద రవిచంద్ర,కావ్య క్రిష్ణారెడ్డి, మాలేపాటి

చంద్రబాబు ని కలిసిన బీద రవిచంద్ర,కావ్య క్రిష్ణారెడ్డి, మాలేపాటి

TEJA NEWS

కావ్య గెలుపు బాధ్యత తీసుకుంటానన్న మాలేపాటి

కావ్య క్రిష్ణారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించి కానుక ఇస్తానని చంద్రబాబు కి హామీ ఇచ్చిన మాలేపాటి ..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గ ఇంచార్జి కావ్య క్రిష్ణారెడ్డి, కావలి తెలుగుదేశం పార్టీ మాజీ ఇంచార్జి మాలేపాటి సుబ్బానాయుడు బుధవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు… నూతనంగా బాధ్యతలు చేపట్టిన క్రిష్ణారెడ్డి ని చంద్రబాబు అభినందించారు… నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు తెలిపారు… కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని కావ్య క్రిష్ణారెడ్డి గెలుపు బాధ్యత తీసుకుంటానని మాలేపాటి సుబ్బానాయుడు చంద్రబాబు కి హామీ ఇచ్చారు… అత్యధిక మెజార్టీతో కావ్య క్రిష్ణారెడ్డి ని గెలిపిస్తామని కావలి నియోజకవర్గాన్ని కానుకగా అందజేస్తామని చంద్రబాబు కి హామీ ఇచ్చారు.. అందరూ కలిసికట్టుగా పనిచేసి కావలిలో తెలుగుదేశం జెండా రెపరెపలాడించాలని చంద్రబాబు కోరారు..ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS