బిజెపిలో చేరిన బిఆర్ఎస్ పార్టీ 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి

బిజెపిలో చేరిన బిఆర్ఎస్ పార్టీ 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి

TEJA NEWS

శంకర్‌పల్లి మున్సిపాలిటీ
బిఆర్ఎస్ పార్టీకి చెందిన 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి తన అనుచరులు 40 మంది యువకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకు కష్టపడి పని చేస్తానని రెండోసారి పార్లమెంటుకు పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బద్దం హనుమంత్ రెడ్డి, కిరణ్ గౌడ్, అజయ్ గౌడ్, సాయికుమార్, నిశ్వంత్ గౌడ్ ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS