గుడిమల్కాపూర్ లో మొబైల్‌ కోసం యువకుడి దారుణ హత్య

గుడిమల్కాపూర్ లో మొబైల్‌ కోసం యువకుడి దారుణ హత్య

TEJA NEWS

హైదరాబాద్ జిల్లాలోని గుడిమల్కాపూర్‌లో ఈరోజు నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన పూల వ్యాపా రం చేసే సనా వుల్లా(24) వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు .. మొబైల్‌ ఇవ్వాలని అడిగారు.

ఆయన ఇవ్వకపోవడంతో లాక్కునేందుకు ప్రయత్నిం చారు. ప్రతిఘటించిన సనావుల్లాను కత్తితో ఛాతీపై పొడిచారు. అనంతరం దుండగులు మొబైల్‌ తీసుకొని బైక్‌పై పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS