వైఎస్సార్సీపీలో చేరిన చల్లగరిక టీడీపీ కార్యకర్తలు

వైఎస్సార్సీపీలో చేరిన చల్లగరిక టీడీపీ కార్యకర్తలు

TEJA NEWS

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. అచ్చంపేట మండలం చల్లగరిక గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మందా వెంకటరత్నం, గాలియ్య, బాబురావు, ఇమ్మానియేల్, బాల యేసు, శ్రీనివాసరావు, కొండ్రు రోశయ్య, సుధీర్,నగరికంటి పిచ్చయ్య తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS