27న ఛలో విజయవాడ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 27న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు.
దీనికి ఉద్యోగులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ రోజు ఉద్యోగుల విశ్వరూపం చూస్తారని ఆయన హెచ్చరించారు.
12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఇతర సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వ పెద్దలు ఏర్పాటు చేస్తున్న సమావేశాలు చాయ్, బిస్కెట్లకే పరిమితం అయ్యాయని దుయ్యబట్టారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-21-at-1.05.21-PM-1.jpeg)