శంకర్పల్లి మండల కేంద్రంలో BRS పార్టీ కార్యాలయాన్ని ఇవాళ సాయంత్రం చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 9 సంవత్సరాలలో మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును గెలిపిస్తాయని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కాసానిని పార్లమెంటుకు పంపాలన్నారు. MPP, AMC చైర్మన్, సొసైటీ చైర్మన్, కౌన్సిలర్లు మాజీ సర్పంచులు, MPTCలు పాల్గొన్నారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-02-at-7.18.59-PM-1024x577.jpeg)