కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీష

కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీష

TEJA NEWS

కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీష
జాతరలో మొక్కులు తీర్చుకున్న మేయర్ దంపతులు*
తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర లో భాగంగా ఉదయం మేయర్ ఇంటి వద్ద నుండి గంగమ్మకు సారె ఊరేగింపు తో సమర్పించారు.

శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష దంపతులు వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని సారె సమర్పించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు,శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి భూమన అభినయ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

మేయర్ మాట్లాడుతూ తిరుపతి లో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరపడం అన్వాయితీగా వస్తుందని తెలియజేశారు.
అమ్మవారి జాతర 1400 సంవత్సరాల నుంచి జరుగుతుందని తెలిపారు.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ను గత సంవత్సరం ప్రభుత్వం వారు రాష్ట్ర పండుగ గుర్తింపు పొందింది అని తెలిపారు.

ఈ పూజా కార్యక్రమంలో మేయర్ తో పాటు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్, డాక్టర్ ముని శేఖర్, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, కార్పొరేటర్ ప్రవళిక,తులసి యాదవ్, దేవదానం, శంకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సురేష్,హేమంత్, వెంకటేష్ రెడ్డి, చింతా రమేష్, మల్లంగుంట రవిచంద్ర రెడ్డి, మస్తానమ్మ, లక్ష్మయ్య యాదవ్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ‌

Print Friendly, PDF & Email

TEJA NEWS