ఉప ముఖ్యమంత్రి , పంచాయతీరాజ్,
ఉప ముఖ్యమంత్రివ , పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్., పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో శాఖల వారి సమీక్ష ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు. శాఖల వారీగా కాకినాడ జిల్లాలో ఉన్న స్థితిగతులను పవన్ కళ్యాణ్ కి అధికారులు వివరిస్తున్నారు.
కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
![ఉప ముఖ్యమంత్రి , పంచాయతీరాజ్](https://tejanews.co.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-02-at-11.59.42-1024x428.jpeg)