TEJA NEWS

వేతనాలనుచెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కార్యాలయం ఎదుట ధర్నా
వనపర్తి : బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతినిత్యం పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి మురికి పనులు చేస్తున్న మున్సిపాలిటీ కార్మికులకు జులై వేతనాలను ఆగస్టు సగం నెల వచ్చిన జీతాలు చెల్లించక పోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వెంటనే వేతనాలను చెల్లించాలని తిండి పెట్టండి పని చెప్పండి అన్ననినాదాలను చేశారు అలాగే ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ తో నాయకులు జరపడంతో వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఒకవేళ జీతాలు ఇవ్వకపోతే ఆగస్టు 15 నిరసన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు అనుబంధం ) జిల్లా అధ్యక్షులుఎం చంద్రయ్య ఉపాధ్యక్షులు యాదగిరి పట్టణ గౌరవ అధ్యక్షులు గడ్డం కురుమయ్య పట్టణ అధ్యక్షులు మౌలాలి. ప్రధాన కార్యదర్శి పి గోపాల్ పట్టణ నాయకులు కే మన్యం సుమన్ జి బాలస్వామి భగవంతు జి రవి బాలు శేఖర్ జయమ్మ చిట్టెమ్మ సుశీలమ్మజయలక్ష్మి రేణుక తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS