తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో విస్తృత పర్యటన

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో విస్తృత పర్యటన

TEJA NEWS

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో విస్తృత పర్యటన
సంక్షేమ ప్రదాత జగనన్న
డాక్టర్ గూడూరు శ్రీనివాస్

హోమ్ మంత్రి తానేటి వనిత, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి స్వాగతం
గోపాలపురం నియోజకవర్గంలో హోం మంత్రి డాక్టర్ తానేటివనిత ఆధ్వర్యంలో బుధవారం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఆత్మీయ కలయిక జరిగింది. ముఖ్య నాయకుల సమావేశాల్లో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు అమితంగా ప్రేమిస్తున్న జగనన్నను తిరిగి అధికారంలోకి రానున్నారు. సంక్షేమ ప్రదాత జగనన్న అన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆదాయాన్ని కేవలం నలుగురైదుగురు జేబుల్లోకే వెల్లేవని, జగనన్న పాలనలో
ప్రభుత్వ ఆదాయాన్ని ప్రజలకు పంచి పెడుతున్నారన్నారు. మరో సారి మీ అందరి ఆశీస్సులను జగనన్నకు అందివ్వాలన్నారు. అఖండ మెజార్టీతో అధికారంలోకి తీసుకు రావాలన్నారు.
హోమ్ మంత్రి తానేటి
వనిత మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేసి శాస్త్రీయ బద్ద మైన సంస్కరణలు పెట్టిన జగనన్నను దీవించాలన్నారు. కార్పొరేట్ కి ధీటుగా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేశారన్నారు.
ద్వారకా తిరుమల మండలం ఐ. ఎస్. జగన్నాథపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గొల్లగుడెం గ్రామంలో రామానుజపురంలో పార్టీ నాయకులతో సమావేశం మాట్లాడారు.
అనంతరం ఐ.ఎస్. రాఘవాపురం గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం మాట్లాడారు. లక్ష్మిపురం గ్రామంలో పార్టీ నాయకుల సమావేశాల్లో మాట్లాడారు.
తదుపరి దేవినేని వారి గూడెంలో సూపర్ మార్కెట్, సొసైటీ లాకర్స్ ను ప్రారంభించారు. అనంతరం దేవినేని వారి గూడెం గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశంలో మాట్లాడారు. పి.కన్నాపురం గ్రామ సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ నాయకుల సమావేశంలోనూ, సంత్రగుంట గ్రామంలో పార్టీ నాయకుల సమావేశంలోనూ, తక్కెళ్లపాడు గ్రామంలో పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. జగనన్నకు ఓటేసెందుకు సిద్దమా అని మంత్రి తానేటి వనిత పేర్కొంటూ జగనన్నను గెలిపించాలన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS