మొదటిసారి ఎంపీ అభ్యర్థి నీలం మధు

మొదటిసారి ఎంపీ అభ్యర్థి నీలం మధు

TEJA NEWS

క్యాంపు ఆఫీసుకు విచ్చేసిన
మంత్రివర్యులు దామోదర రాజనరసింహా

పూలే భోకే ఇచ్చి మంత్రి ని
స్వాగతించిన నీలం మధు ముదిరాజ్

మంత్రి దామోదర తో..
ఎంపీ నీలం మధు భేటి

రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోద రాజనర్సింహా తో మెదక్ కాంగెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ భేటి అయ్యారు. సోమవారం చిట్కూల్లోని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ క్యాంపు కార్యాలయానికి మంత్రి దామోదర రాజనర్సింహా విచ్చేశారు. ఈ సందర్భంగా నీలం మధు మంత్రి కి పూలే భోకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి గారు.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన అంశాలపై నీలం మధుగారితో సుధీర్ఘంగా చర్చించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలలో నెలకొన్న పరిస్థితులను మధును అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్న ఎన్నికల సన్నాహాక సమావేశాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లెలా పార్టీ కార్యకర్తలను సమయత్తం చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS