ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

TEJA NEWS

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు..

ఉత్తరాంధ్ర నుంచి ‘శంఖారావం’ ప్రారంభం కానుందని, యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళికలు ఉంటాయన్నారు.

”ప్రజలు, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపడమే ‘శంఖారావం’ లక్ష్యం. రోజూ 3 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. సుమారు 50 రోజుల పాటు కొనసాగుతుంది. ఇచ్ఛాపురంలో ఈ నెల 11న తొలిసభ నిర్వహిస్తాం. జగన్‌ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పిస్తాం” అని అచ్చెన్న తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS