వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ MLC ఉపఎన్నిక ఓటర్ల నమోదు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది.
చివరి రోజు కావడంతో ఎక్కవ మంది దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
2023 నవంబర్ 1 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడేండ్లు గడిచిన వారు దరఖాస్తుకు అర్హులని సీఈసీ నిర్ణయించింది.
ఇప్పటికీ 3.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితా వెల్లడించనున్నారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-06-at-8.00.02-AM-1024x623.jpeg)