పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో 27 న జగన్ సమావేశం

పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో 27 న జగన్ సమావేశం

TEJA NEWS

ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్‌ జరగనుంది.

175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

ఈ ఎన్నికల్లో వై నాట్‌ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలో, ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలనే విషయంపై ఈ సమావేశంలో శిక్షణ ఇస్తారని తెలుస్తోంది.

ఈ నెల 27న ఉదయం 9.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల సమయంలో సీఎం జగన్‌ రానున్నారు. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS