జ‌గ‌న్ భూ స్కాంపై మోదీకి ఫిర్యాదు..లేఖ రాసిన జ‌న‌సేన పార్టీ చీఫ్..ప‌వ‌న్

Spread the love

Pawan Kalyan : జ‌గ‌న్ భూ స్కాంపై మోదీకి ఫిర్యాదు..లేఖ రాసిన జ‌న‌సేన పార్టీ చీఫ్..ప‌వ‌న్

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఊహించ‌ని రీతిలో మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ త‌రుణంలో శ‌నివారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏకంగా జ‌గ‌న్ స‌ర్కార్ హ‌యాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్ర‌మాల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు.

పేద‌లంద‌రికీ భూమి పేరుతో వైసీపీ స‌ర్కార్ భారీ కుంభ‌కోణానికి పాల్ప‌డింద‌ని ఆరోపించారు. ఈ స్కీం కింద రూ. 35,141 కోట్లకు పైగా దోపిడీ జ‌రిగింద‌ని మండిప‌డ్డారు. పేద‌లంద‌రికీ ఇళ్ల ప‌ట్టాల పేరుతో జ‌రిగిన దోపిడీ నిర్వాకంపై సీబీఐ, ఈడీల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

ఈ స్కీం కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో ముడి ప‌డి ఉంద‌ని అందుకనే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని తాము కోరిన‌ట్లు చెప్పారు జ‌న‌సేన పార్టీ చీఫ్‌. ఇదిలా ఉండ‌గా ఈసారి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం , జ‌న‌సేన పార్టీలు క‌లిసి బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించారు.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page