TEJA NEWS

మంగళగిరిలో “”జనవాణి””…ప్రజా సమస్యల పరిష్కార వేదిక….

మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో జనవాణి కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ..

జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని సదుద్దేశంతో “జనవాణి” అనే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సంగతి విదితమే… అందులో భాగంగా రెండవ రోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ నాయకులు, అధికారులతో కలిసి ఈ “జనవాణి” కార్యక్రమంలో పాలొన్నారు..

ఈ జనవాణి వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని ప్రజలు సమస్యలని అర్జీ రూపంలో శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ కి అందజేయడం జరిగింది….కొన్ని సమస్యలకు సంబంధిత అధికారులతో అక్కడే మాట్లాడి సాధ్యమైనంతమేర అక్కడే సమస్యను పరిష్కరిస్తున్నారు..


TEJA NEWS