రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సైడ్ కాలనీ క్లీన్ చేయాలి మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ఐఏఎస్

రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సైడ్ కాలనీ క్లీన్ చేయాలి మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ఐఏఎస్

TEJA NEWS

ఇంకొక 20 రోజుల్లో వర్షాకాలం వస్తున్నందున కాలువలన్నీ క్లీన్ చేయాలని ఎక్కడెక్కడ కాలువలు పూడుక పోయినవో లిస్టు ప్రిపేర్ చేసి తమకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ఐఏఎస్ అన్నారు. సోమవారం నాడు మున్సిపల్ కార్యాలయంలో సానిటరీ ఇన్స్పెక్టర్ తో మరియు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ తో మీటింగ్లో ఎస్సైలకి చెప్పడం జరిగినది. ప్రతి ఎస్ఐ వారి డివిజన్లో ఎక్కడైతే వాటర్ ఆగుతున్నాయో వారి డివిజన్ వారిగా లిస్టు ప్రిపేర్ చేయాలని చెప్పడం జరిగినది. ఎక్కడైతే కాలువల్లో చెత్త ఎక్కువ గా పేరుక పోయి వాటర్ ఆగుతున్నాయి అనేది గుర్తించి వాటిని గ్యాంగ్ వర్క్ పెట్టి క్లీన్ చేసే ప్రదేశాలు ఏమిటి మిషనరీ తో క్లీన్ చేసే ప్రదేశాలు ఏమి అనేది గుర్తించి డివిజన్ వారిగా కమిషనర్ కి ఇవ్వాలని ఏస్ ఐ లను ఆదేశించడం జరిగినది. డివిజన్లో పూడుకపోయినటువంటి మెయిన్ కాలువలు అన్నిటిని గ్యాంగ్ వర్క్ పెట్టి శుభ్రపరచాలని చెప్పడం జరిగినది గ్యాంగ్ వర్క్స్ తో కానీ ఎడల మిషనరీ తో శుభ్రపరచాలని చెప్పడం జరిగినది .

కాలువల్లో ఎవరైతే చెత్త వేస్తున్నారు వారికి గుర్తించి వారికి జరిమానా వేయాలని ఎస్ఐలకి చెప్పడం జరిగినది ప్రతి ఎస్సై రోజుకి కాలువల్లో చెత్త వేసిన ప్రదేశాల్లో ఇంటి యజమానులకు ఎన్ని ఫైన్ లు వేశారు అనేది కమిషనర్ స్వయంగా పరిశీలిస్తానని చెప్పడం జరిగినది. రోడ్ల వెంట పెట్టిన కొబ్బరి బోండాలు షాపులు వాళ్ళు ముంజకాయల వాళ్లు కాలువల్లో ఆ చెత్త వేసినా ఎడల వారికి ఫైన్ భారీగా విధించాలని చెప్పడం జరిగినది. అంతే ఖాళీ గా చెత్త పేరుకుపోయినటువంటి ప్లాట్ ఓనర్స్ అందరికీ శుభ్రపరచాలని నోటీసులు ఇవ్వాలని చెప్పడం జరిగినది. శుభ్రపరచనా యెడల వారిపై చర్యలు చేపట్టాలని అన్నారు
వర్షాకాలం వస్తున్నందున ముందుగానే గ్యాంబూజా ఫిష్ ని మరియు ఆయిల్ బాల్స్ ని సమకూర్చుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ కి చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సంపత్ మరియు సానిటరీ ఇన్స్పెక్టర్లులు & ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పాల్గొనడం జరిగినది.

Print Friendly, PDF & Email

TEJA NEWS