సంగారెడ్డి జిల్లా: మార్చి06
సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణహత్యకు గుర య్యాడు. జిన్నారం మండలం ఐడియా బొల్లారంలో బుధవారం ఉదయం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బొల్లారంలో నివాసం ఉంటున్న యాదగిరి అనే వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఆ వ్యక్తి పూర్తిగా రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-06-at-21.10.30-1024x875.jpeg)