మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం పార్టీ అభ్యర్థి మున్న బాషా

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం పార్టీ అభ్యర్థి మున్న బాషా

TEJA NEWS

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11 మహబూబ్ నగర్ పార్లమెంట్ లోక్ సభ స్థానానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మున్న బాషా గారు ,రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ కి ఎంఐఎం పార్టీ తరుపున నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎంఐఎం లోక్ సభ అభ్యర్థి మున్న బాషా ,గద్వాల్ జిల్లా ఎంఐఎం జాయింట్ సెక్రటరీ ఇమాముద్దీన్, గద్వాల్ ఎంఐఎం మండల అధ్యక్షుడు రఫీ,పెబ్బేరు ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు ఎండి ఆఫ్రోజ్,చంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS