బాపట్ల జిల్లాలోని బాపట్ల మున్సిపల్ కమిషన్ కార్యాలయంలో MSME డెవలప్మెంట్ కార్యాలయం విశాఖపట్నం ఆధ్వర్యంలో డాక్టర్ కే ఎల్ ఎస్ రెడ్డి I.E.D.S అధ్యక్షతన విశ్వకర్మ పథకం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీమతి. బి. విజయలక్ష్మి, డైరెక్టర్ AP MSME డెవలప్మెంట్ కార్పొరేషన్, శ్రీ వై.రామకృష్ణ, జిల్లా పరిశ్రమల అధికారి, శ్రీ.వందనం అసిస్టెంట్ మేనేజర్ CSC శ్రీ.శివకృష్ణ, LDM, శ్రీ. తమ్మాజీ రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, శ్రీ.P. విజయ్ రెడ్డి, లాయర్ & NGO ప్రతినిధి హాజరయ్యారు. బాపట్ల జిల్లా పరిసరాల ప్రాంతాల నుండి 300 మంది కళాకారులు ఈ సదస్సులో పాల్గొని విశ్వకర్మ పథకం అమలు, ప్రయోజనాలు గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా MSME DFO అధికారులు మరియు వారి సిబ్బంది ద్వారా PM విశ్వకర్మ దరఖాస్తులలో 60 మంది కళాకారులకు మరియు నమోదు చేసుకున్న అభ్యర్థులకు గుంటూరు నుండి బాపట్లకు వ్యాపార చిరునామా మార్చటం జరిగినది.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-5.28.50-PM-1024x460.jpeg)