ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

TEJA NEWS

విశాఖపట్నం మార్చి 19:

ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్ – 2024 పురస్కారం లభించింది. రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ ఈ పురస్కారాన్ని ఆచార్య లక్ష్మీ ప్రసాద్ కు ప్రకటించగా, మంగళవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో వై అల్ పి కి అవార్డ్ ను అందచేసి అభినందించారు. ఏయూ ఆచార్యులు సాధించే పురస్కారాల వర్సిటీకి ప్రతిష్టను పెంచుతాయన్నారు. ఈ సందర్భంగా ఆచార్య లక్ష్మీ ప్రసాద్ ను పలువురు విశ్వవిద్యాలయ ఆచార్యులు అభినందించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS