TEJA NEWS

ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశాలుతో పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగింపు.

సాక్షిత ::పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే నీ కలిసి కాలేజీ చుట్టుపక్కల పెరిగిపోయి ఉన్నా పిచ్చి మొక్క లను తొలగించి పాములు, పందులు, కుక్కల బాధల నుండి రక్షణ కల్పించాలని కోరిన వెంటనే శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ 13 వ తేదీన ఉదయం జీవీఎంసీ సిబ్బంది పిచ్చి మొక్కలను తొలగించి కాలేజీ ప్రాంగణాన్ని శుభ్రం చేయడం జరిగినది. ఈ విషయమై కాలేజ్ ప్రిన్సివల్, విద్యార్థులు ఎమ్మెల్యే కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS