కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి , టిపిసిసి ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి , మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి తో కలిసి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు *కూన శ్రీశైలం గౌడ్ * పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి మరో సారి మల్కాజ్ గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరేసి, సునీతమ్మ ను ఎంపీ గా గెలిపించాలని శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-27-at-1.08.48-PM-1024x683.jpeg)