మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ప్రచారం: దండు శ్రీనివాస్ గుప్త

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ప్రచారం: దండు శ్రీనివాస్ గుప్త

TEJA NEWS

కంది: మే 02: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ఆయన పై ఉన్న అభిమానంతో శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త 20 రోజుల నుండి 15 మంది కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కంది మండల పరిధిలోని ఇంద్రకరణ్ పాశ మైలారం క్యాసారం గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించి చేతి గుర్తుకి ఓటేయాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దండు శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో శ్రీధర్ గౌడ్, మల్లేష్, రాజు, అభిషేక్ గౌడ్, ఎం సంతోష్, శ్రీనివాస్, శ్రీరాములు, నర్సింలు, ప్రసాద్, విట్టల్, శేఖర్, ప్రవీణ్, మహేష్ చారి, కే రాజు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS