ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత

ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత

Three-tier security for vote counting పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలు దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 1 సెక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.