ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

TEJA NEWS

గుంటూరు: ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది..

క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా మంగళగిరికి చెందిన వారిగా గుర్తించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS