TEJA NEWS

సర్దార్ @150 యూనిటీ మార్చ్ కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్

సూర్యపేట జిల్లా ప్రతినిధి: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి ని పురస్కరించుకొని ప్రజలలో జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందించేందుకుగాను, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సహకారంతో “సర్దార్ @150 యూనిట్ మార్చ్” ను నిర్వహించనున్నట్లు ఎంపీ, రాజ్యసభ సభ సభ్యులు కేసరి దేవ్ సిన్హ జ్వాల తెలిపారు. సర్దార్ @150 యూనిటీ మార్చ్ కార్యక్రమం అమలులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జిగా నియమితులైన ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధికారుల తో కలిసి మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడారు. సర్దార్ @150 యూనిటీ మార్చ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ సమైక్యత,దేశభక్తి ని పెంపొందించడం, ప్రత్యేకించి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర , జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 31 నుండి నవంబర్ 25 వరకు జిల్లాలలో విడతలవారీగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, సర్దార్ @150 యూనిటీ మార్చ్ లో 3 రోజుల పాదయాత్రను జిల్లాస్థాయిలో నిర్వహించాలని, ప్రతి పాదయాత్ర 8 నుండి 10 కిలోమీటర్లు ఉండేలా చూడాలని, ఈ పాదయాత్రలో కనీసం 500 మంది యువత, విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ఆయన అధికారులతో కోరారు. సర్దార్ @150 యూనిటీ మార్చ్ నిర్వహించడంలో భాగంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధికారులతో కోర్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని , ఇందులో విశ్రాంత ఐఏఎస్ అధికారులు, జిల్లా యువజన సర్వీస్ల అధికారి, ఇతర అధికారులు, ప్రతినిధులతో కో-ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ విషయమై ప్రతివారం జాతీయ స్థాయి కోర్ కమిటీ సమీక్షలు నిర్వహిస్తున్నదని వెల్లడించారు. సర్దార్ @150 యూనిటీ మార్చ్ కార్యక్రమాలలో భాగంగా జిల్లా స్థాయిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి సంబంధించి ప్రజలకు,యువతకు తెలియజేయడం, వైద్య శిబిరాల నిర్వహణ ,యోగ క్యాంపులు, ఎగ్జిబిషన్లు, వర్క్ షాప్ ల నిర్వహణ ,కళాశాల,పాఠశాల విద్యార్థులకు డిబేట్,ఇతర కాంపిటీషన్ల నిర్వహణ, వీధి నాటకాలు, ప్రచారాలు, స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టాలని ఆయన తెలిపారు. ఇందుకుగాను ఆయా జిల్లాల వారీగా రూట్ మ్యాప్ ను రూపొందించాలన్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో నవంబర్ 12, 13 తేదీలలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఇదే అంశంపై అదనపు కలెక్టర్ కే సీతారామారావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎంపీ, రాజ్యసభ సభ్యులు కేసరి దేవ్ సిన్హ జ్వాల ,కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో సర్దార్ @ 150 యూనిట్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదనపు ఎస్పీరవీందర్ రెడ్డి ,జిల్లా క్రీడల అధికారి వెంకట్ రెడ్డి,జిల్లా యూత్ అధికారి రాజేష్, జెడ్పి సీఈఓ అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇంటర్ మీడియేట్ అధికారి భాను నాయక్, డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్,మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.