3న పెళ్లి రిసెప్షన్.. తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పెళ్లికూతురు సహా పెళ్లి కొడుకు కుటుంబమంతా మృతి

3న పెళ్లి రిసెప్షన్.. తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పెళ్లికూతురు సహా పెళ్లి కొడుకు కుటుంబమంతా మృతి

TEJA NEWS

నంద్యాల: ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఒకటి ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు..

కారులో ఓ ఫ్యామిలీ తిరుపతి (Tirupathi) నుంచి హైదరాబాద్‌ (Hyderabad)కు బయలుదేరించింది. ఆళ్లగడ్డ మండలానికి చేరుకునే సరికి మరి డ్రైవర్‌ను నిద్ర మత్తు ఆవహించిందో లేదంటే అతి వేగం కారణంగానో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.

ఇక మృతులంతా హైదరాబాద్‌లోని ఆల్వాల్‌లోని వెస్ట్ వెంకటాపురానికి చెందిన రవికుమార్, లక్ష్మీ, సాయికిరణ్, ఉదయ్ కిరణ్, కావ్య శ్రీగా గుర్తించారు. వీరిలో బాలకిరణ్, కావ్యలకు ఫిబ్రవరి 29న తెనాలిలోపెళ్లైంది. ఈ నెల 3న షామీర్‌పేటలో గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా జరిగింది. లక్ష్మి, రవికుమార్‌ వచ్చేసి.. బాలకిరణ్ తల్లిదండ్రులు. రిసెప్షన్ వేడుకలు ముగిసిన వెంటనే స్విఫ్ట్ కారులో తిరుమల దైవదర్శనానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS