TEJA NEWS

రాజానగరం జాతీయ రహదారిపై ప్రమాదం
-స్పందించిన జిల్లా కలెక్టర్
-తక్షణ వైద్య సహాయం అందించేలా జి.ఎస్.ఎల్ ఆసుపత్రి వైద్యులకు సూచనలు
రాజానగరం :
రాజానగరం నియోజకవర్గ పరిధిలో అకస్మిక తనిఖీలలో భాగంగా క్షేత్ర స్థాయిలో పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం జాతీయ రహదారిపై లారీ మోటార్ సైకిల్ ను ఢీకొన్న ఘటనలో గాయాల పాలైన ముగ్గురికి తక్షణ వైద్యం అందించేందుకు 108 ఫోన్ చేయడం జరిగింది. క్షత్రగాత్రులను అంబులెన్స్ ద్వారా జి ఎస్ ఎల్ ఆసుపత్రి కి పంపడం జరిగింది.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిఎస్ఎల్ ఆసుపత్రి వర్గాలతో ఫోన్లో సంప్రదించి తగిన వైద్య సేవలు అందించవలసిందిగా సూచించడం జరిగింది. జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియమాలను పాటించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వాహన చోదకులకు విజ్ఞప్తి చేశారు.


TEJA NEWS