TEJA NEWS

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన జవాన్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పదవ వార్షికోత్సవం సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇదే విషయమై జవాన్ యూత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయకుని నవరాత్రులు సందర్భంగా ప్రతి ఏటా వినాయకుని విగ్రహాన్ని ఏర్పరచుకొని ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, నియమ నిబంధనలతో భగవంతుని ఆరాధన చేయడం ఎంతో శ్రేష్టమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జవాన్ యూత్ కమిటీ సభ్యులు మున్న మహేష్, సిలివేరు నరసింహ, గణేష్, సతీష్, వల్లోజు నవీన్, అనతుల మహేష్, మధు, సంపత్, వేణు, మహేష్, గణేష్, ఉమేష్. తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS