TEJA NEWS

రేపటి నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు..

30 నిమిషాల ముందే గేట్లు మూసివేయనున్న ట్లు అధికారుల వెల్లడి

హైదరాబాద్‌:

కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి యూపీ ఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్‌ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ప్రతీయేట లక్షలాది మంది యువత పోటీ పడుతుంటారు.

సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామి నేషన్‌ సీఎస్‌ఈ 2024 ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తికాగా.. రేపట్నుంచి మెయిన్స్‌ పరీక్షలు ప్రారం భం కానున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా యూపీఎస్సీ జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహిం చిగా.. ఫలితాలు జులై 1న విడుదలయ్యాయి.

షెడ్యూల్‌ ప్రకారం మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్‌ 20, 21, 22, 28, 29 తేదీల్లో జరుగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరగనున్నాయి, ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షల ను నిర్వహిస్తారు.

ఒక్కో సెషన్‌ పరీక్ష మూడు గంటల పాటు జరుగు తుంది. మెయిన్స్‌ పరీక్షలు మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగుతాయి.ఈ తేదీల్లో దేశవ్యాప్తంగా 24 పట్టణా ల్లో ఈ పరీక్షలను నిర్వహిం చనున్నారు.

హైదరాబాద్‌ లో మెయిన్స్‌ పరీక్షల కోసం 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 708 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించ బోమని అధికారులు సూచించారు.

మెయిన్స్ అనంతరం ప్రతిభకనబరచిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. మెయిన్స్ అనంతరం అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. మెయిన్స్‌, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా సర్వీసులను కేటాయిస్తారు.


TEJA NEWS