TEJA NEWS

శంకర్‌పల్లి: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్

శంకరపల్లి : గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని MPDO వెంకయ్య గౌడ్ కోరారు. MPDO కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా MPDO మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ జాబితా సవరణకు అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఓటర్ జాబితా ముసాయిదాను విడుదల చేసినట్లు తెలిపారు. ఎమ్మార్వో సురేందర్,MEO, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.


TEJA NEWS