TEJA NEWS

రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ మరియు జ్యోతి నగర్ కాలనీ మధ్యలో నూతనంగా 95.00 లక్షల రూపాతీలతో నిర్మిస్తున్న నాలా ను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఈఈ సురేష్ తో కలిసి స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆకస్మిక పర్యటన చెయ్యడం జరిగింది.వర్షాకాలం పూర్తి అయింది కావున పని త్వరత్వరగా నాణ్యత రాజి లేకుండా పూర్తి చేయాలి అని ఎందుకంటే ఇప్పుడు నిర్మిస్తున్న ఓపెన్ డ్రైన్ కొన్ని సంవత్సరాలు ఉండాలి కావున క్యూరింగ్ తప్పనిసరిగా ఉండాలి అని కార్పొరేటర్ కాంట్రాక్టర్,అధికారులకు ఆదేశించడం జరిగింది.అలాగే ఓపెన్ డ్రైన్ పూర్తి అయినా వెంటనే సీసీ రోడ్ వేయించి,సమస్యలు అన్ని పరిష్కరిస్తా అని హామీ ఇచ్చిన కార్పొరేటర్.వారితో శేష రెడ్డి,పవన్,ఖలీమ్,శేఖర్,సీఎం మల్లేష్,లక్ష్మణ్,సత్యనారాయణ,కిరణ్ గౌడ్,శ్రీహరి,ఊర్మిళ తదితరులు.


TEJA NEWS